నిజామాబాద్ : జిల్లాలోని సారంగాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. కుటుంబ కలహాలతో దంపతులు నిన్న రాత్రి గొడవపడ్డారు. దీంతో భర్త ఎల్లయ్య(55)ను భార్య నర్సమ్మ రోకలిబండతో కొట్టి చంపింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దంపతులిద్దరూ ఓ మహిళ హత్య కేసులో అరస్టై ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు.