పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన్. అక్కడ ఒక మహిళ నగ్న స్థితిలో ఉంది. ఆమెను ఎవరో తాళ్లతో కట్టేసి ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది.
వివరాలలోకి వెళితే.. ఛత్తీస్గఢ్కు చెందిన షాలిని(40, పేరు మార్చబడినది) భర్త 2017లో మృతి చెందాడు. అదే సమయంలో దినేష్ రాణా అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకరోజు దినేష్ షాలిని ఇంటికి వచ్చి ఆమె స్నానం చేస్తుండగా.. వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆ వీడియో చూపిస్తూ షాలినిని బ్లాక్మెయిల్ చేసేవాడు.
షాలిని వద్ద తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునేవాడు. ఒకరోజు ఆమెను ప్రేమిస్తున్నానని.. అందువల్ల తనను వివాహం చేసుకోమని అడిగాడు. ఒంటరిగా బతుకుతున్న షాలిని అందుకు అంగీకరించింది. అలా వారిద్దరూ 2020లో పెళ్లికున్నారు. కొన్ని రోజుల తర్వాత దినేష్ తనకు బిలాస్పూర్లో ఉద్యోగం వచ్చిందని.. అందువల్ల తనతో అక్కడికి రావాలని షాలిని కూడా అక్కడికి రావాలని చెప్పాడు.
అలా బిలాస్పూర్ వెళ్లిన షాలినికి అక్కడ ఒక షాకింగ్ నిజం తెలిసింది. దినేష్ అసలు పేరు దానిష్ ఇనామ్ అని, అతను ఒక ముస్లిం అని ఆమె తెలిసుకొంది. అంతేకాదు దానిష్కు ఇంతకుముందే ఒక భార్య ఉంది. అప్పటికే దినేష్ అలియాస్ దానిష్ ఆమె వద్ద రూ.8 లక్షలకు పైగా డబ్బులు లాగేసుకున్నాడు. దీంతో తను మోసం చేశాడంటూ దానిష్పై షాలిని ఫిర్యాదు చేసింది.
పోలీసులకు తనపై ఫిర్యాదు చేసినందుకు కోపంతో ఉన్న దానిష్ తన స్నేహితులను తీసుకొని షాలిని ఇంటికి వెళ్లాడు. దానిష్, అతని ఇద్దరు స్నేహితులు షాలినిని చిత్రహింసలు పెట్టి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను తాళ్లతో కట్టేసి తమపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించి వెళ్లిపోయారు. పోతూ.. పోతూ.. ఇంటికి బయటి నుంచి తాళం వేసి వెళ్లారు.
పక్కింటివారు షాలిని అరుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షలు చేసి ఆమెపై అత్యాచారం చేశారని నిర్ధారించుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితులు దినేష్ అలియాస్ దానిష్, అతని ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు.