హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తగ్గడం.. అందులో రెండు చోట్ల ఓటమి అంచులవరకు వెళ్లడంతో ఇళ్లిళ్లు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఓ ఆలయంలో జరిగిన పూజలకు ఆయన పాల్గొన్నారు. పూజారుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. తమది మతతత్వ పార్టీ కాదని, సెక్యులర్ పార్టీ అని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పాతబస్తీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. హైదరాబాద్లోని పోలింగ్ బూత్లపైనే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని ప్రశ్నించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లో ఎందుకు శ్రద్ధపెట్టరంటూ నిలదీశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని చెప్పారు.
#WATCH | AIMIM chief and Hyderabad LS candidate Asaduddin Owaisi says, “Police and ECI should focus on all polling booths of Telangana. Elections should be conducted in a free and fair manner…Why only focus on Hyderabad polling booths? Why not focus on Nizamabad, Adilabad,… pic.twitter.com/nc1yuF55Vc
— ANI (@ANI) May 6, 2024