Minister KTR | నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుల తరఫున ట్విట్టర్ వేదికగా తన గళం వినిపించారు. ఇది తెలంగాణ సామాన్యుడి గళం.. సామాన్య శాస్త్రం అని చెప్పుకొచ్చారు.
‘ ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు.. ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదు..’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు.. కానీ.. ఆగమేఘాలపై అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యంగా ఉందని విమర్శించారు. ప్రజలు దాచుకున్న రెక్కల కష్టాన్ని ధారపోస్తుండటంపై సామాన్యుడు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్ అని దేశానికి అర్థమైపోయిందని విమర్శించారు.
ఇది తెలంగాణ సామాన్యుడి గళం…
“సామాన్య శాస్త్రం”# ఆకాశాన్ని అంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు
# ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదు
# గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదుకానీ…
# ఆగమేఘాల మీద అదానీ కంపెనీని
ఆదుకోవడమే మీ ఏకైక… pic.twitter.com/ZezkY72WPv— KTR (@KTRBRS) April 23, 2023