HomeNewsWhat Is The Name Of The Optional Unemployed
ఐచ్ఛిక నిరుద్యోగితకు గల పేరు?
నిరుద్యోగం
పనిచేయాలని ఆసక్తి ఉండి, పనిచేయగలిగే శక్తి, సామర్థ్యాలు ఉండి, మార్కెట్లో అమలులో ఉన్న వేతనం వద్ద పని దొరకని పరిస్థితిని ‘నిరుద్యోగం’, అలాంటి వ్యక్తిని ‘నిరుద్యోగి’ అని అంటారు.
నిర్వచనాలు
ఏసీ ఫిగూ: ఒక వ్యక్తి నిరుద్యోగిగా ఉన్నప్పుడు అంటే ఉద్యోగితను కోరుతూ నిరుద్యోగిగా మిగిలిపోవడాన్ని నిరుద్యోగం అంటారు.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో): పని లభించే స్థితిలో ఉన్నవారు పనిని కోరుకుంటున్నప్పటికీ పని లభించకపోతే దానిని నిరుద్యోగిత అంటారు.
ఎంఎస్ దంత్వాలా కమిటీ నిపుణుల సంఘం: పనికోసం వెతుకుతున్న వ్యక్తులు ఒక నిర్ణీత వారంలో పూర్తిగా పనిలేకుండా ఉండి భవిష్యత్తులో కూడా పని మిగిలిపోయే స్థితిని నిరుద్యోగిత అంటారు.
ఏసీ వెర్నర్: ప్రస్తుతం ఉన్న వేతనాల రేటుకు ఇష్టపడి పనిచేసే వారికి ఏమంత కష్టంలేని పని దొరకడాన్ని సంపూర్ణ ఉద్యోగిత అంటారు.
ఐఎల్వో ప్రకారం 15-65 సంవత్సరాల మధ్య వయస్సువారు పనిచేయాలనే కోరికతో పాటు పనిచేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే వారిని లేబర్ ఫోర్స్ (శ్రామిక వర్గం)గా భావించవచ్చు.
అమెరికాలో 16 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని లేబర్ ఫోర్స్గా తీసుకుంటారు.
భారత్లో 15-59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారిని లేబర్ ఫోర్స్గా తీసుకునేవారు. ప్రస్తుతం 15-64 సంవత్సరాల మధ్య వయస్కులను లేబర్ ఫోర్స్గా తీసుకుంటున్నారు.
వర్క్ ఫోర్స్ (శ్రామికులు/శ్రామిక జనాభా)
15-64 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి పని (ఉత్పత్తి)లో పాల్గొనేవారిని వర్క్ ఫోర్స్ అంటారు. లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ని తీసివేస్తే నిరుద్యోగిత లభిస్తుంది.
L.F = W.F + అన్ ఎంప్లాయ్మెంట్
శ్రామిక వర్గం = శ్రామికులు + నిరుద్యోగులు
శ్రా.వర్గం – శ్రామికులు = నిరుద్యోగులు
నోట్: పనిచేసేవారిని శ్రామికులు అంటారు.
శ్రామికులు 2 రకాలు
1) ప్రధాన శ్రామికులు (మెయిన్ వర్కర్స్)
ఒక సంవత్సర కాలంలో 6 నెలల కంటే ఎక్కువ రోజులు లేదా 365 రోజుల్లో 183 రోజుల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొనేవారిని ప్రధాన శ్రామికులు అంటారు.
ఉదా: ప్రభుత్వ ఉద్యోగులు: పోలీస్, డాక్టర్, లాయర్
2) ఉపాంత శ్రామికులు (మార్జినల్ వర్కర్స్)
ఒక సంవత్సర కాలంలో 6 నెలల కంటే తక్కువ రోజులు లేదా 365 రోజుల్లో 183 రోజుల కంటే తక్కువ రోజులు పనిలో పాల్గొనే వారిని ఉపాంత శ్రామికులు అంటారు.
ఉదా: రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, చక్కెర కర్మాగారాలు, జనపనార పరిశ్రమల్లో పనిచేసేవారు.
భారత్లో నిరుద్యోగాన్ని లెక్కించే అధికారిక సంస్థ- ఎన్ఎస్ఎస్వో
ఎన్ఎస్ఎస్వో- నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (జాతీయ గణాంకాల సర్వే సంస్థ)
ఎన్ఎస్ఎస్వోను 1950లో ఏర్పాటు చేశారు.
దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
ఎన్ఎస్ఎస్వో ప్రతి ఐదేండ్లకోసారి
నిరుద్యోగాన్ని లెక్కిస్తుంది.
ఎన్ఎస్ఎస్వో నిరుద్యోగాన్ని అంచనా వేసిన తరువాత వచ్చిన విలువ వాస్తవమా/కాదా అని ధృవీకరించే అధికారిక సంస్థ- ప్రణాళికా సంఘం (2015, జనవరి నుంచి
నీతి ఆయోగ్ ధృవీకరిస్తుంది)
నీతి- నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (భారత జాతీయ పరివర్తన సంస్థ)
నీతి ఆయోగ్ 2015, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ఎన్ఎస్ఎస్వో నిరుద్యోగాన్ని కింది సూత్రం ద్వారా లెక్కిస్తుంది.
ఎన్ఎస్ఎస్వోను 1950లో ఏర్పాటు చేశారు. దీనిలో యూపీఎస్సీ నియమించిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగులు, ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) ద్వారా నియమితులైన సబార్డినేట్ స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు.
ఎన్ఎస్ఎస్వోలో 4 భాగాలు ఉంటాయి.
1) ఎస్డీఆర్డీ- సర్వే డిజైన్ అండ్ రిసెర్చ్
డివిజన్
2) ఎఫ్వోడీ- ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్
3) డీపీడీ- డాటా ప్రాసెసింగ్ డివిజన్
4) సీపీడీ- కో ఆర్డినేషన్ అండ్ పబ్లికేషన్
డివిజన్
సర్వే డిజైన్ అండ్ రిసెర్చ్ డివిజన్: ఇది మహలనోబిస్ భవన్ ఆధ్వర్యంలో కోల్కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
ఈ విభాగం సర్వే ప్రణాళిక, శాంపిల్ (నమూనాలు) సేకరణ, నిర్వచనాలు, సర్వే రికార్డుల తయారీ వంటి వాటిని రూపొందిస్తుంది.
ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్: దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలోని ఫరీదాబాద్.
దీనిలో 6 జోనల్ కార్యాలయాలు, 49 ప్రాంతీయ కార్యాలయాలు, 116 ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
ఇది సర్వేల నిర్వహణ, ఆర్థిక సామాజిక విషయాలు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల గణాంకాలు, ధరల సేకరణ వంటి వాటిని రూపొందిస్తుంది.
డాటా ప్రాసెసింగ్ డివిజన్: దీని ప్రధాన కేంద్రం కోల్కతా. సేకరించిన సమాచారాన్ని సంక్షిప్తపరిచి, సూక్ష్మీకరణ చేసి పట్టికల రూపంలో సమాచారాన్ని, తుది గణాంకాలను తయారు చేస్తుంది.
కో ఆర్డినేషన్ అండ్ పబ్లికేషన్ డివిజన్: దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. ఇది సర్వేక్షణ అనే పక్ష పత్రికను రెండేండ్లకోసారి విడుదల చేస్తుంది.
జాతీయ స్థాయిలో సెమినార్లు, చర్చలను నిర్వహించి సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు- 3
1) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ (క్యాపిటలిస్ట్ ఎకానమీ)
దీని రూపకర్త ఆడం స్మిత్. ఇతడిని ప్రణాళికల పితామహుడు అని పిలుస్తారు.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థసై ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తే అలాంటి ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు.
ఈ వ్యవస్థలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు.
పెట్టుబడుల విషయంలో ప్రైవేట్ వ్యక్తులే పూర్తి స్వతంత్రాన్ని కలిగి ఉంటారు.
ఈ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో ‘స్వేచ్ఛాయుత వ్యాపారం’ అమల్లో ఉంటుంది.
ఈ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తులు లాభార్జన ధ్యేయంగా పనిచేస్తారు.
ఈ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తులు ప్రణాళికారహితంగా ముందుకెళ్తారు.
దీనిలో మార్కెట్లో ‘ధరల యంత్రాంగం (ప్రైస్ మెకానిజం)’ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ వ్యవస్థలో వ్యాపార చక్రాలు (లాభనష్టాలు) ఏర్పడతాయి (బిజినెస్ సైకిల్స్).
ఈ వ్యవస్థలో అమ్మకందారుల కంటే వినియోగదారులకే హక్కు ఎక్కువగా ఉంటుంది.
ఉదా: అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగమే పెట్టుబడులు పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు.
పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ రంగానికే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
ఈ వ్యవస్థలో ప్రైవేట్ పెట్టుబడులపై ప్రభుత్వ ఒత్తిడి, అజమాయిషీ, నియంత్రణలు ఉంటాయి.
ఈ వ్యవస్థలో ప్రభుత్వం లాభనష్టాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ‘ప్రజా సంక్షేమానికే’ అధిక ప్రాధాన్యం ఇస్తుంది.
ఈ వ్యవస్థలో ‘ధరల యంత్రాంగం’ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది.
ఉదా: రష్యా, చైనా, క్యూబా, వెనిజులా, వియత్నాం, టర్కీ, ఉత్తర కొరియా.
3) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ (మిక్స్డ్ ఎకానమీ):
దీని రూపకర్త- జేఎం కీన్స్
జేఎం కీన్స్ను ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అని అంటారు.
ఇతడు 1936లో జనరల్ థియరీ- ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథాన్ని రచించాడు.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం కలిసి పెట్టుబడులు పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తే దానిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అంటారు.
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ+సామ్యవాద ఆర్థిక వ్యవస్థ = మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
ఈ వ్యవస్థలో ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకొని పెట్టుబడుల విషయంలో ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కానీ ఈ వ్యవస్థ మొత్తం ప్రభుత్వ రంగం ఆధీనంలోనే కొనసాగుతుంది.
ఉదా: భారతదేశం
భారత్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదు.
భారత్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పీవీ నరసింహారావు 1991, జూలై 24న ఆర్థిక సంస్కరణల్లో భాగంగా, ఎల్పీజీ నమూనాలో భాగంగా అమల్లోకి తెచ్చారు.
భారత్ 1956కు ముందు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విధానాలు, 1956-91 మధ్యలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలు. 1991, జూలై 24 నుంచి ప్రస్తుతం వరకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాలతో కొనసాగుతుంది.
ప్రాక్టీస్ బిట్స్
కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి? 1) ఎన్ఎస్ఎస్వో నిరుద్యోగాన్ని లెక్కించే సంస్థ 2) ఎన్ఎస్ఎస్వో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది 3) ఎన్ఎస్ఎస్వో నిరుద్యోగాన్ని ప్రతి ఐదేండ్లకోసారి లెక్కిస్తుంది 4) పైవన్నీ సరైనవే
ఎన్ఎస్ఎస్వో సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1942 2) 1965 3) 1950 4) 1952
శ్రామిక వర్గం నుంచి శ్రామికులను తొలగిస్తే మిగిలినవారు ఎవరు? 1) శ్రామికులు 2) ఉద్యోగులు 3) 1, 2 4) నిరుద్యోగులు
నిరుద్యోగిత రేటు =? 1) (శ్రామికులు/శ్రామిక వర్గం) X 100 2) (నిరుద్యోగుల సంఖ్య/శ్రామిక వర్గం) X 100 3) (దేశ జనాభా/శ్రామిక వర్గం)X 100 4) పైవన్నీ సరైనవే
నిరుద్యోగాన్ని లెక్కించడానికి 1973లో నియమించిన కమిటీ? 1) రాఘవ కమిటీ 2) చంద్రా కమిటీ 3) టెండూల్కర్ కమిటీ 4) భగవతి కమిటీ
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాల వల్ల ఏర్పడే నిరుద్యోగిత? 1) చక్రీయ నిరుద్యోగిత 2) సంఘృష్ట నిరుద్యోగిత 3) 1 సరైనది, 2 సరైనది కాదు 4) పైవన్నీ సరైనవే
ఆర్థిక మాంద్యం కాలంలో ఏర్పడే నిరుద్యోగిత? 1) సంఘృష్ట నిరుద్యోగిత 2) ప్రచ్ఛన్న నిరుద్యోగిత 3) చక్రీయ నిరుద్యోగిత 4) 1, 2 సరైనవి, 3 సరైనది కాదు