కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో వర్సిటీలకు ఛాన్సలర్గా మమతా బెనర్జీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన బిల్ను ఇవాళ అసెంబ్లీలో పాస్ చేశారు. ద బెంగాల్ యూనివర్సిటీ సవరణ బిల్లును ఇవాళ సభలో రాష్ట్ర విద్యా మంత్రి బ్రత్య బాసు ప్రవేశపెట్టారు. వర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం టేకోవర్ చేయడం తప్పుకాదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విశ్వ భారతికి ప్రధాని ఛాన్సలర్ అయినప్పుడు, మరి వర్సిటీలకు సీఎం ఎందుకు ఛాన్సలర్ కారాదు అని మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ జగదీప్ అన్ని ప్రోటోకాల్స్ను ఉల్లంఘించినట్లు ఆయన అన్నారు. 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో.. 182 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 40 మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. దీని వల్ల రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.