వికారాబాద్ : మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ( KCR )ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు మహిళ కు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్పేట మీర్పేట, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించిందని గుర్తు చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సంక్షేమ పథకాలలో పక్షపాత దోరణిని అవలంభించవద్దని సూచించారు. అర్హులందరికీ పథకాలు అందజేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని తెలిపారు.
పేద మహిళల పెండ్లీలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగ పడ్డాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బడంగ్పేట, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్లు సుమన్ రావు, వాని రెడ్డి, వసంత రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, తదితరులు ఉన్నారు.