హైదరాబాద్ : జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం పడకల్ గ్రామానికి చెందిన పీ రత్నశీల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానలో చేరారు.
నిరుపేద కుటుంబం కావడంతో సాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి సీఎం సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. శనివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి