– 60 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
మియాపూర్ : కష్టకాలంలోను పేదప్రజల సంక్షేమానికే రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గాంధీఅన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంద్వారా 60మందికి మంజూరైన రూ.60లక్షల 06వేల 960 రూపాయల చెక్కులను కార్పొరేటర్లు రోజాదేవిరంగారావు, దొడ్ల వెంకటేశ్గౌడ్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్తోకలిసి ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశంలో ఏరాష్ట్రంలో అమలుచేయని సంక్షేమపధకాలను తెలంగాణరాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు. కరోనావంటి విపత్కర పరిస్ధితుల్లోను పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీకార్పొరేటర్ రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి , రఘునాధ్రెడ్డి, ఎరగుడ్ల శ్రీనివాస్, వాలాహరీష్, కాశీనాధ్యాదవ్, పోతుల రాజేందర్ తదితరులు పాల్డొన్నారు.