ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రతకు ముప్పు ఏర్పడింది. ఇటీవల ముంబైలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి హోంశాఖ ఐడీ కార్డుతో నిషేధిత ప్రాంతాల్లో అమిత్ షా తిరిగాడు. ఆ ఘటనకు చెందిన కొన్ని నిజాలు ఇప్పుడే వెలుగులోకి వచ్చాయి.ఈ కేసులో హేమంత్ పవార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏపీకి చెందిన ఓ ఎంపీ వద్ద అతను పర్సనల్ సెక్రటరీగా చేస్తున్నాడు. హోంశాఖ ఐడీ కార్డుతో ఆ వ్యక్తి అమిత్ షా చుట్టూ కొన్ని గంటల పాటు తిరిగినట్లు తెలుస్తోంది. సెక్యూర్టీ అరేంజ్మెంట్స్ చూస్తున్న ఆఫీసర్ తరహాలో ఆ వ్యక్తి బిల్డప్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అమిత్ షా పాల్గొన్న రెండు ఈవెంట్లకు అతను హాజరయ్యాడు. ఇక సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఇండ్ల వద్ద కూడా అతను కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. హేమంత్ కదలికల పట్ల అనుమానం వచ్చిన హోంశాఖ అధికారి ఒకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హేమంత్ పవార్ను పోలీసులు ప్రశ్నించారు. అతను హోంశాఖ సెక్యూర్టీ టీమ్లో లేనట్లు గ్రహించారు. ప్రస్తుతం పవార్ను అయిదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.