కరీంనగర్ : ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు.
పార్టీ బలోపేతాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వివరించారు .కేసీఆర్ కు కరీంనగర్ మీద ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన జి.వి.రామకృష్ణ రావును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు.
2018 ఎన్నికల కంటే 2023 లో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధంగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిందే మాకు శిలా శాసనం అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కుతాయి. అంత వరకు వేచి చూడాలని మంత్రి తెలిపారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే వారిని పార్టీ క్షమించదన్నారు.