న్యూఢిల్లీ: ఐఫోన్ 14 తాజా మోడల్ను ఇండియాలో ఉత్పత్తి చేయనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. చైనాలో ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని ఇండియాకు తరలిస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఐఫోన్ 14లో కొత్త టెక్నాలజీ ఉందని, అతి ముఖ్యమైన భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది. ఇండియాలో ఐఫోన్ 14ను ఉత్పత్తి చేయడానికి ఉత్సాహంగా ఉన్నామని కూడా ఆ సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఏడాది చివర వరకు 5 శాతం ఐఫోన్ 14 తయారీ ఇండియాలో జరగనున్నట్లు జేపీ మోర్గన్ సంస్థ అంచనా వేస్తోంది. 2025 నాటికి నాలుగింటిలో ఒక ఐఫోన్ ఇండియాలోనే తయారవుతుందని జేపీ మోర్గన్ సంస్థ తెలిపింది.