హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ గత 20 ఏండ్లలో అనేక ఎత్తుపల్లాలను చవిచూసిందని, ఒక్క ఉప ఎన్నిక ఫలితం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. టీఆర్ఎస్ కార్యకర్తలంతా మరింత నిబద్ధతతో పనిచేస్తూ, భవిష్యత్తు సవాళ్లను ఎదురొంటూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్లో స్ఫూర్తిమంతమైన పోటీ ఇచ్చారని పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను అభినందించారు.
ప్రజాతీర్పును శిరసావహిస్తాం: ఆర్థిక మంత్రి హరీశ్రావు
హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్కి ఓట్లేమీ తగ్గలేదని చెప్పారు. దేశంలో ఎకడా లేనివిధంగా హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే చెప్తున్నారని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో కొట్లాడుకొనే బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రస్థాయిలో కుమ్మకు కావడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఒక ఓటమితో కుంగిపోదు.. గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచినా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని పేర్కొన్నారు.