పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి
తీవ్రగాయాలతో దవాఖానలో చేరిన తిరుపతి
కేసు నమోదు చేసిన పోలీసులు
పలిమెల, మార్చి 30 : నన్ను జైలుకు పంపిస్తావా? నీ అంతు చూస్తా.., అంటూ కత్తితో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై శ్యాంరాజ్పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెల గ్రామానికి చెందిన దిబ్బ ల తిరుపతి, చౌదరి రాజుకు మధ్య కొద్ది రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో రాజుపై తిరుపతి కేసు పెట్టడంతో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్పై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తిరుపతిపై కక్ష పెంచుకున్న రాజు ఎలాగైన చంపాలని నిర్ణయిం చుకున్నాడు. సోమవారం రాత్రి సోమవారం సాయంత్రం 7 గంటలకు సరుకులు తెచ్చేందుకు గంగిరెడ్డి రమేశ్కు చెందిన కిరాణా షాపునకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన రాజు ద్విచక్రవాహనంపై వచ్చి నన్ను జైలుకు పంపుతావా! నీ అంతు చూస్తా అంటూ తిరుపతి తలపై పొడిచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని మహదేవపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడం తో హైదరాబాద్ గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. బాధితుడి సోదరి కుమ్మరి బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.