వరంగల్, మే: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం కార్పొరేషన్ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో వేసవి క్రీడా శిబిరాలను ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పిల్లలు క్రీడా మైదానాలకు దూరం అయ్యారని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కార్పొరేషన్ వేసవి క్రీడా శిబిరాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. స్టేడియంలో వుడెన్ ఫ్లోరింగ్, సింథటిక్ మ్యాట్, టాయ్లెట్స్లను మరమ్మతులు చేసినట్లు తెలిపారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలబాలికలు సమ్మర్ కోచింగ్ క్యాంప్లను వినియోగించుకోవాలని సూచించారు. అనుభవం కలిగిన కోచ్ల ఆధ్వర్యంలో క్యాంపులను నిర్వహిస్తున్నామని చెప్పారు. బాల బాలికల కోసం ప్రత్యేకంగా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డీఎఫ్వో కిశోర్, బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరిశంకర్, కోచ్లు, బాలబాలికలు పాల్గొన్నారు.
కనీస వసతులు కల్పించాలి
బల్దియా గ్రీవెన్స్లో కమిషనర్కు కాలనీవాసుల వినతి కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని బల్దియా గ్రీవెన్స్లో ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కమిషనర్ ప్రావీణ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ప్రజారోగ్యం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, పన్నుల విభాగాలకు సంబంధించిన ప్రజలు గ్రీవెన్స్లో అధికారులకు వినతులు అందచేశారు. గ్రీవెన్స్లో మొత్తంగా 81 వినతులు వచ్చాయి. టౌన్ప్లానింగ్ విభాగానికి 31, ఇంజినీరింగ్ విభాగానికి 35, ప్రజారోగ్యం 5, పన్నుల విభాగానికి 9 వినతులు వచ్చాయి. ఈ గ్రీవెన్స్లో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, సిటీప్లానర్ వెంకన్న, డీఎఫ్వో కిశోర్, డిప్యూటీ కమిషనర్ జోనా, హార్టీకల్చర్ అధికారి ప్రిసిల్లా పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని గ్రేటర్ కార్పొరేషన్ సివిల్ కాంట్రాక్టర్లు వారి అసోసియేషన్ అధ్యక్షుడు జన్ను సతీశ్ నేతృత్వంలో కమిషనర్ను కలిసి వినతిపత్రం అందచేశారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్ నిర్ణయించాలని వినతిపత్రంలో కోరారు. క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం 85 శాతం స్ట్రెంత్ సరిపోతుందని, దీనిని అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టర్లకు సర్కిల్ కార్యాలయాల్లో వెయిటింగ్ రూం సదుపాయం కల్పించాలని కోరారు.