గీసుగొండ, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వం తీసుకొవచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా నాయకులు బ్రహ్మచారి డిమాండ్ చేశారు. మం డంల వ్యాప్తంగా సోమవారం కార్మికులు, ఆల్ యూనియన్ నాయకులు సమ్మె లో పాల్గొన్నారు. కార్మిక చట్టాలను రుద్ద చేసే వరకు సమ్మె చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ సంఘాల, పార్టీ నాయకులు సార య్య, ప్రభాకర్, మురలి, స్వామి, నిర్మల, అరుణదేవి, ఉమ, అన్నపూర్ణ, రాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో బందు విజయవంతం
పర్వతగిరి: పర్వతగిరిలో బంద్ విజయవంతమైంది. తెలంగా రాష్ట్ర సమితి కార్మిక విభాగం గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ బాబు ఆదేశానుసారం రెండు రోజుల సమ్మెలో భాగంగా సోమవారం పీఏసీఎస్ పరిధిలో బంద్ నిర్వహించారు. దీని కోసం అన్ని సంఘాల ఆధ్వర్యంలో రెం డు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని టీఆర్ఎస్కేవీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ చింతకాయల సురేశ్ కోరారు.
నెక్కొండలో కార్మిక సంఘాల ర్యాలీ
నెక్కొండ: నెక్కొండలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నా యకులు వ్యవసాయ మార్కెట్ నుంచి అంబేద్కర్ కూడలిమీదుగా ర్యాలీ తీశారు. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు పెట్రోల్ బంక్లను కార్మిక సంఘాల నాయకులు మూసివేయించడంతో సమ్మె విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, గ్రా మ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, వివిధ సంఘాల నాయకులు మం దాడి శ్రీను, సీతారాములు, వెంకన్న, ఈదునూరి సాయిలు, బైరు నర్సయ్య, భిక్షపతి, మల్లయ్య, శ్రీమన్నారాయణ, యుగేంధర్, ఉపేంద్ర, నరేశ్, వీరస్వామి పాల్గొన్నారు.
సీఐటీయూ,ఏఐకెఎఫ్ ఆధ్వర్యంలో..
సంగెం,మార్చి 28 : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం మండలంలోని కాపులకనపర్తిలో సీఐటీయూ, ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండలాధ్యక్షుడు దుపాకి రాజు, ఏఐకేఎఫ్ అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ , మంద రవి, కుమారస్వామి, కార్మికులు సంపత్, ఎల్లన్న, వీరస్వామి, రత్నాకర్రాజు తదితరులు పాల్గొన్నారు.