ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా నారసింహ వైభవాన్ని నలుదిక్కులా చాటిన అపూర్వ ఘట్టం యాదాద్రి దివ్య క్షేత్రం పునరవతరణం!
సిద్ధించిన సీఎం కేసీఆర్ మహా సంకల్పం.. యాదాద్రీశుడి నిజరూప దర్శనం..నేత్రపర్వం..మహాకుంభ సంప్రోక్షణ పర్వం..ఓం నమో నారసింహాయ!!
కృష్ణశిలా వైభవం..ఇల వైకుంఠం మన ఇలవేల్పు నిలయం.. అడుగు మోపిన జన్మధన్యం!!!
వైభవోపేతంగా యాదాద్రి ఆలయ పునరావిష్కారం
ఏకశిఖరవాసుడు, స్వయంభు పంచనారసింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రంలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధృఢసంకల్పంతో పునర్నిర్మితమైన ఆలయం పునరావిష్కారం అంగరంగ వైభవంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణ,
నమో నారసింహాయ స్మరణ నడుమ.. మిథున లగ్నంలో సోమవారం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా జరిగింది.
సరిగ్గా 12.30గంటలకు మూలవర్యుల దర్శనభాగ్యం కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా గర్భాలయంలోకి వెళ్లి తొలిపూజలో
పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఈ మహాక్రతువులో పాల్గొని పునీతులయ్యారు.
నవ యాదాద్రిని చూసి భక్తజనులు సంతోషంతో పులకరించిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత స్వామివారిని దర్శించుకుని
కరుణాకటాక్షాలు పొందారు.