ఖానాపురం, మార్చి 27: రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఎంపీపీ అధ్యక్షతన ఆదివారం ప్రత్యేక మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని సభ్యులు ముక్తకంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నదని, కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రైతులను గత ప్రభుత్వాల మాదిరిగానే మోదీ సర్కారు ఇబ్బందులకు గురిచేసేందుకు పన్నాగం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకూ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, షేక్ సుభాన్బీ, మండల కో ఆప్షన్ సభ్యుడు మస్తాన్, సర్పంచ్లు కాస ప్రవీణ్కుమార్, పద్మావతి, సుమన్, రమేశ్నాయక్, వల్లెపు సోమయ్య, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, వెన్ను పూర్ణచందర్, బోడ బాలరాజు, ఆర్బీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు బొప్పిడి పూర్ణచందర్రావు, మౌలానా, రాజు, పోశెట్టి, శ్రీను, పూలు, బాలు, వెంకన్న పాల్గొన్నారు.
ధాన్యం కొనాలని ఏకగ్రీవ తీర్మానం
రాయపర్తి(వర్ధన్నపేట): యాసంగి సీజన్ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ వర్ధన్నపేట మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అన్నమనేని అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశానుసారం ధాన్యం కొనుగోళ్లపై పోరాటాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, సోమయ్య, ఎంపీడీవో తక్కళ్లపల్లి రాజ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం మార్కెట్ ప్రధాన కార్యాలయంలోని చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది.