నర్సంపేటరూరల్, మార్చి 27: టీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్డ్డి అన్నారు. మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన 40 మంది వివిధ పార్టీల నుంచి ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముగ్ధుంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఇర్కు రవీందర్రావు, బోమరబోయిన స్వామి, రైతు కమిటీ సభ్యులు అర్శనపెల్లి సంతోష్రావు, ఎస్సీ కమిటీ అధ్యక్షుడు గాదె శ్రీధర్, బీజేపీ యూత్ మండల అధ్యక్షుడు అమ్మ అజయ్, పల్లకొండ అశోక్తోపాటు మరో 34 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుండడంతో ఎంతో మంది ఆకర్షితులై గులాబీ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, బీసీసెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, మాజీ ఎంపీటీసీ అర్శనపెల్లి వెంకటేశ్వరావు, నాయకులు పెండ్యాల ప్రభాకర్, సుధాకర్, నర్సయ్య పాల్గొన్నారు.