రాయపర్తి(వర్ధన్నపేట), మార్చి 27: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆరోగ్యశ్రీ పథకంలో లేని వ్యాధులకు ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు పొందుతూ ఆర్థికంగా చితికిపోతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపత్కాల సంజీవనిలా ఉపయోగపడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన అడ్డూరి విజయ్కుమార్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. ఈ మేరకు ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అరూరి అందజేసి మాట్లాడారు. ప్రజల అమూల్యమైన ప్రాణాలను కాపాడేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. తెలంగాణలోని సకల జనులకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేలు జరుగుతున్నదని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్రావు, టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం.. సీఎంఆర్ఎఫ్
సంగెం/గీసుగొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు ధర్మారెడ్డి హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం రూ. 7,87,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న అభాగ్యులు, నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఆశాలపల్లి సర్పంచ్ కిశోర్యాదవ్, బొమ్మ యుగేంధర్, శ్రీనివాస్, రవీందర్, సురేశ్ పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండలం కోనాయిమాకుల క్రాస్ వద్ద టీఆర్ఎస్ యూత్ నాయకులు ఏర్పాటు చేసిన లస్సీ సెంటర్ను ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం టీఆర్ఎస్ కొమ్మాల గ్రామ కార్యదర్శి రాజమౌళి-రజిత దంపతులు, పార్టీ నాయకుడు కడారి ఐలయ్య-లక్ష్మి దంపతుల కుమార్తెల వివాహాలకు ఎమ్మెల్యే వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్లు వీరాటి కవిత, నాగేశ్వర్రావు, జైపాల్రెడ్డి, గోనె మల్లారెడ్డి, ఉపసర్పంచ్ నాగయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజ్కుమార్, నాయకులు వీరాటి రవీందర్రెడ్డి, కుమారస్వామి, మండల రవి, వీరస్వామి, లెనిన్, చంద్రారెడ్డి పాల్గొన్నారు.