ఖానాపురం/నల్లబెల్లి/నర్సంపేటరూరల్/రాయపర్తి/సంగెం/దుగ్గొండి, మార్చి 26: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా రైతులు నిరసనలు తెలిపారు. అలాగే, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. మోదీ సర్కార్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపురం జీపీ కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు సమక్షంలో జీపీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కార్యక్రమంలో ఎంపీటీసీ బోడ భారతి, సర్పంచ్లు బూస రమా చిరంజీవి, ఉపసర్పంచ్ కుమార్, సామ్యేల్, కో ఆప్షన్ సభ్యులు పోశెట్టి, పూర్ణచందర్రావు, బూస అశోక్, కార్యదర్శి సుప్రజ పాల్గొన్నారు.
నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లెలో జీపీ ఏకగ్రీవ తీర్మానం చేసి, సర్పంచ్ ఊరటి అమరేందర్ ఆధ్వర్యంలో తీర్మాన ప్రతిని ప్రధాని నరేంద్రమోదీకి పోస్టు చేశారు. నర్సంపేట మండలం రామవరం సర్పంచ్ కొడారి రవన్న ఆధ్వర్యంలో జీపీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. సభలో ఉప సర్పంచ్ జినుకల విమల, వార్డు సభ్యులు కోరబోయిన కుమారస్వామి, ఊర్మిల, సురేశ్, సుమలత, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జినుకల విజేందర్, గ్రామపెద్దలు జినుకల శంకర్, కిషన్, రాము, రవి పాల్గొన్నారు.
రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్తోపాటు పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఉప సర్పంచ్ అంబటి రమాదేవి, అఖిలపక్ష నాయకులు చెరుకూరి నాగేశ్వర్రావు, జంపాల మధు, మచ్చ సత్యం, మాలోత్ వసుందర్నాయక్ పాల్గొన్నారు. సంగెం ఎంపీపీ కళావతి అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీగరాజుపల్లి ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి తీర్మా నం ప్రవేశపెట్టారు. పెట్రో, వంట నూనెల ధరలను తగ్గించాలని చింతలపల్లి ఎంపీటీసీ బొమ్మ పావని తీర్మానం చేశారు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతం పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలుపాలని ఎల్గూర్రంగంపేట ఎంపీటీసీ బానోత్ పద్మ తీర్మానాన్ని ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, తాసిల్దార్ రాజేంద్రనాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీవో కొమురయ్య, మన్సూర్ అలీ, నరహరి పాల్గొన్నారు. దుగ్గొండి ఎంపీడీవో కార్యాయలంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అద్యక్షతన సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. యా సంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ కాపీని ప్రధానమంత్రికి పోస్టు చేశారు. సమావేశంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, ఎంపీటీసీలు బండి జగన్నాథం, పిండి కుమారస్వామి, మోర్తాల రాజు, మాలోత్ చంద్రునాయక్, కొల్లూరి విజయా మోహన్రావు, కొంగర అరుణ-రవి పాల్గొన్నారు.