కరీమాబాద్, నవంబర్ 30: పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పౌరహక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా వరంగల్ ఉర్సు హరిజనవాడలో నిర్వహించిన సదస్సులో 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ పాల్గొని మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే చట్టాలు ఉన్నాయని తెలిపారు. పౌరులు తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పోశాల స్వామి, ఈదుల రమేశ్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను తెలుసుకోవాలి
చెన్నారావుపేట/నెక్కొండ: సంక్షేమ పథకాలు, పౌరహక్కులు, వాటి విధివిధానాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్ సూచించారు. కోనాపురంలోని ఎస్సీకాలనీవాసులకు అధికారులు పౌరహక్కులపై అవగాహన కల్పించారు. ఎస్సీ హాస్టళ్లలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పరిసరాల శుభ్రత, సాదాబైనామా, కులవివక్ష, పోలీసుల సేవలు, పౌష్టికాహారంపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెల్దె సుజాతాసారంగం, ఎంపీడీవో గడ్డల దయాకర్, ఎస్సై తోట మహేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కోడి మంజుల, హాస్టల్ వెల్ఫేర్ అధికారి మధురిమ, ఎంపీటీసీ మహేందర్, ఉప సర్పంచ్ నర్సింహరాములు, కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు రాజ్కుమార్, చిరంజీవి, బస్వయ్య పాల్గొన్నారు. నెక్కొండ మండలం పనికరలో సర్పంచ్ పింగిళి విజయమోహన్రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపొద్దన్నారు. ఆర్ఐ సత్యనారాయణ, ఏఎస్సై సాంబారెడ్డి, ఏఈవో వసంత, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామలాదేవి, కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
అంటరానితనాన్ని నిర్మూలించాలి
నర్సంపేట రూరల్: అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల వైద్యాధికారి భూపేశ్, రామవరం సర్పంచ్ కొడారి రవన్న పిలుపునిచ్చారు. రామవరం జీపీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో డీటీ ఉమారాణి, ఉప సర్పంచ్ విమల, కార్యదర్శి వీరేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.