పరకాల, నవంబర్ 15 : పరకాల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం తెల్లవారు జామున మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందులో భాగంగానే పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. పట్టణంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తయిందని, రానున్న రోజుల్లో డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పట్టణ వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణను మెరుగు పరచనున్నట్లు వివరించారు పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణాభివృద్ధికి ప్రజలు సహకారం అందించాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరిస్తారని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కౌన్సిలర్లు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మె ల్యే చల్లా పేర్కొన్నారు.
కుంకుమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక మాస రెండో సోమవారాన్ని పురష్కరించుకుని పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, ఒంటేరు సారయ్య, పొరండ్ల సంతోష్, బండి రాణీసదానందం, మార్క ఉమారఘుపతి, శనిగరపు రజినీనవీన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మడికొండ శ్రీను, మేరుగు శ్రీశైలం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.