హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్లో 30వ సీనియర్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ హోరాహోరీగా కొనసాగుతోంది. మూడు రోజుల పోటీల్లో భాగంగా రెండో రోజు వివిధ రాష్ర్టాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు జట్టు గెలుపు కోసం చివరి వరకూ పోరాడారు. గెలుపే లక్ష్యంగా పాయింట్లు సాధిస్తూ దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడగా ఆంధ్రప్రదేశ్ జట్టుపై తెలంగాణ గెలుపొందింది. అలాగే. తెలంగాణ మహిళల జట్టుపై కర్ణాటక జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి తోట శ్యాంప్రసాద్ మాట్లాడుతూ వివిధ రాష్ర్టాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈ పోటీల్లో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫెడరేషన్ కప్లో పాల్గొంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ మహేంద్రసింగ్ క్యాగీ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ను తిలకించారు. వారిని ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కోట్ల రామకృష్ణ, తమిళనాడు ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి నెల్సన్ సామిల్, సౌత్జోన్ ఖోఖో కమిటీ చైర్మన్ ఎం సీతారామిరెడ్డి, నల్గొండ కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అతికుల్లా, ఉపాధ్యక్షుడు కత్తి కుమారస్వామి, ఖమ్మం అధ్యక్షుడు పీ రామయ్య, నిజామాబాద్ కార్యదర్శి జీ సాగర్రెడ్డి, వీర రాఘవయ్య, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కోశాధికారి బన్న విజయ్కుమార్, హ్యాండ్బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
రెండోరోజు మ్యాచ్ల వివరాలు..పురుషుల విభాగం
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ జట్లు పోటీ పడగా(13-12) తెలంగాణ జట్టు ఒక పాయింట్తో గెలిచింది
కేరళ-తమిళనాడు జట్లు తలపడగా (12-11) కేరళ ఒక పాయింట్తో గెలుపొందింది.
మహిళల విభాగం
కర్ణాటక-తెలంగాణ జట్లు తలపడగా (19-02) కర్ణాటక 17 పాయింట్లతో గెలుపొందింది.
తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ జట్లు పోటీ పడగా (12-10) తమిళనాడు రెండు పాయింట్లతో గెలిచింది.