రాయపర్తి, మార్చి 1 : సర్కారు బడులను బాగు చేసుకుంటే భవిష్యత్తు తరాలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేసినట్లవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీల చైర్మన్లకు ‘మన ఊరు – మన బడి’ అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సర్కారు పాఠశాలలు సర్వమత దేవాలయాలు అని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమగ్రాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా పలు కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతోపాటు ప్రభుత్వ బడుల దశను మార్చాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అమలుకు అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కలెక్టర్ బీ.గోపీ, అదనపు కలెక్టర్లు బానోతు హరిసింగ్, శ్రీవాత్సవ్, జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి, జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, డీపీవో నాగపురి స్వరూప, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, మండల ప్రత్యేకాధికారి నరేష్కుమార్నాయుడు, ఎంపీడీవో గుగులోతు కిషన్నాయక్, జడ్పీటీసీ రంగు కుమార్, ఎంఈవో నోముల రంగయ్య, జిల్లా నోడల్ ఆఫీసర్ గారె కృష్ణమూర్తి, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు అయిత రాంచందర్, బిల్ల రాధికా సుభాష్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, పూస మధు, పీఆర్ ఏఈ శేషం కిరణ్కుమార్, ఈఈ నరేందర్రెడ్డి, ఏపీవో దొణికెల కుమార్గౌడ్ పాల్గొన్నారు. కాగా మండలానికి చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ గోపి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.