స్టేషన్ ఘన్పూర్, మే 18 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నష్ట పరిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని తానేదార్పల్లి గ్రామానికి చెందిన గాదె దానియల్ ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే, గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకంలో తేడా రావొద్దని, ధాన్యం బస్తాలను వెంటవెంటనే మిల్లర్లకు పంపించాలన్నారు.
సెంటర్లలో రైతులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మాచర్ల గణేశ్, నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, మాచర్ల రఘురాములు, గెండె రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాలంటూ నియోజకవర్గానికి చెందిన లాయర్లు ఎమ్మెల్యే రాజయ్యకు వినతి పత్రం అందించారు. బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే రాజయ్యను క్యాంపు కార్యాలయంలో లాయర్లు కలిసి కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాలని కోరా రు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, న్యాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. కార్యక్రమంలో లాయర్లు కనకం రమేశ్, రమేశ్ రెడ్డి, మునిగాల రవీందర్, నూనె రవీందర్, అబ్బాస్ అలీ, గట్టు రవి, గుర్రం బాబు, సంపత్, నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.