రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మాదన్నపేట చెరువులో 2.20 లక్షల ఉచిత రొయ్యపిల్లలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం విడుదల చేశారు. తొలుత చెరువులో పసుపు, కుంకుమ, పూలు చల్లి, కొబ్బరికాయలు కొట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో నీలి విప్లవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నర్సంపేటరూరల్, నవంబర్ 9 : మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువులో మంగళవారం 2.20 లక్షల రొయ్యపిల్లలను ఎమ్మెల్యే పెద్ది విడుదల చేశారు. అంతకుముందు చెరువులో పసుపు, కుంకుమ, పూలు చల్లి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నీలివిప్లవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ సహకారంతో వందశాతం సబ్సిడీపై అందించిన రొయ్య పిల్లలను చెరువులో పోసినట్లు తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టికి చేపపిల్లల పంపిణీతో పాటు రొయ్య పిల్లల పంపిణీని సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. మత్స్యశాఖ అభివృద్ధి పథంలో నడవడానికి అవసరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు, వ్యవసాయ ఆధారిత వృత్తుల వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు అందించేందుకు ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేంలో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని పురుషులు, మహిళలకు కిసాన్క్రెడిట్ కార్డులు అందిస్తామని చెప్పారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ధాన్య పు సిరులు, మత్స్య సంపద కళ్లఎదుట కనబడుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్కుమార్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, మాజీ చైర్మన్ నాగెళ్లి వెంకటనారాయణ, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్రెడ్డి, ఎంపీ పీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాధన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, మున్సిపల్ కౌన్సిలర్లు జుర్రు రాజు, చంద్రమౌళి, నాగిశెట్టి పద్మ, గుంటి కిషన్, పుల్లూరి స్వామి, రాజేందర్, తడిగొప్పుల మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.