వరంగల్, డిసెంబరు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, తకళ్లపల్లి రవీందర్రావు ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి చాంబర్లో వారు ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులు సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.