హుజూరాబాద్ :ఈటల రాజేందర్ తన బాధను అందరికీ రుద్దే ప్రయత్నం చేస్తున్నాడని, ఆ బాధను మన అందరి బాధగా మార్చుకుని ఆగమవుదామా? మనందరి బాధలు తీర్చే కేసీఆర్గా అండగా ఉందమా ఆలోచించండని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ ఈటల రాజేందర్ను నా తమ్ముడని, కుడిభుజమని చెప్పి ఆయన గౌరవం పెంచి అన్నిఅవకాశాలిచ్చాడని మంత్రి గుర్తు చేశారు. అలాంటిది కేసీఆర్ తెచ్చిన కల్యాణ లక్ష్మి అవసరం లేదన్నాడు. అది కడుపు నింపదన్నాడు..ఆసరా ఫించన్ అన్నం పెట్టదన్నాడు. రైతుబంధు దండుగ అన్నాడు. ఓ మంత్రిగా ఉండి పథకాలన్నీ వద్దన్న ఈటల రాజేందర్ 10.5 లక్షల రైతు బంధు తీసుకోలేదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. పేద ప్రజలకు పథకాలు వద్దన్నఈటల రాజేందర్కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.
పేద ప్రజల పక్షపాతిగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మానవతావాది కేసీఆర్ను మానవత్వం లేదని ఈటల మాట్లాడు తున్నాడు. కేసీఆర్ కు మానవత్వం ఉందో లేదో.. కేసీఆర్ తెచ్చిన పథకాలు అనుభవిస్తున్నవారిని అడుగు అంటూ హరీశ్రావు అన్నారు. ఈటలకు ఇవ్వని పదవిలేదు..రాని అవకాశం లేదు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప..టీఆర్ఎస్ నీకు అన్ని ఇచ్చింది. అన్నీ ఇచ్చిన కేసీఆర్ కు ఘోరీ కడతానన్న రాజేందర్ కే మానవత్వం లేదని మంత్రి అన్నారు.
రాని కరెంట్ కు బిల్లులు వేసినవాళ్లు, నీళ్లు ఇవ్వకుండానే నీటి తీరువా వసూలు చేసిన వాళ్లున్నారు. కానీ ఉచిత కరెంట్ ఇచ్చి, నీటి తీరువా తీసేసి, రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ కు మానవత్వం లేదా? అని ఆయన ప్రశ్నించారు. నీవు చేరిన బీజేపీ ఏం చేస్తోంది. బావుల కాడ మీటర్లు పెట్టమంటోంది. మార్కెట్లు రద్దు చేస్తామంటోంది. ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు.. తనకు మాత్రం కుర్చీ కావాలంటున్నాడు ఈటల అంటూ ఎద్దెవా చేశారు.
రాజేందర్ టీఆర్ఎస్లకు రాకముందే హుజురాబాద్ టీఆర్ఎస్ అడ్డ అని ఇక్కడ ఎగిరేది గులాబీ జెండేనని మంత్రి స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగాలు ఊడగొట్టే బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి. పండుగ పూట ధరలు పెంచి పేద ప్రజల ఉసురుపోసుకుంటున్న బీజేపీకి ఓటేయాలా? అని ఆయన ప్రశ్నించారు. దళిత, బలహీన, బడుగుల వ్యతిరేక పార్టీ అయిన బీజేపీని ఓడించి, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.