ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఇలా నల్ల జెండాలతో రైతులు నిరసనలు తెలిపారు.