Prakash Raj | లోక్సభ ఎన్నికలు 2024 (Lok Sabha Elections 2024)లో భాగంగా కర్ణాటక రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలతోపాటు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకొని.. ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ (Prakash Raj) బెంగళూరులోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరితో కలిసి సాధారణంగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా ఓటు నా హక్కు. పార్లమెంట్లో నాకు ఎవరు ప్రాతినిధ్యం వహించాలో నా వాయిస్ని ఎంచుకునే అధికారాన్ని నాకు ఇస్తుంది. మీరు నమ్మిన అభ్యర్థికి ఓటు వేయడం చాలా ముఖ్యం. గత దశాబ్దంలో మనం చూసిన విభజన, ద్వేషపూరిత రాజకీయాల నుండి మార్పును వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో నేను నమ్మిన అభ్యర్థికి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో రెండు దశలో పోలింగ్ జరుగనుండగా.. మొదటి దశలో నేడు రాష్ట్రంలోని 14 పార్లమెంట్ నియోజవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ నిర్వహించనున్నారు.
క్యూ లైన్లో ప్రకాశ్రాజ్..
बेंगलुरु: लोकसभा चुनाव 2024 के दूसरे चरण का मतदान जारी है। अभिनेता प्रकाश राज ने डाला अपना वोट। #LokSabhaElections2024 #prakashraj #bengaluru #Election2024 pic.twitter.com/UrOZ72FblL
— AajTak (@aajtak) April 26, 2024