Vodithala Satish Kumar | మాజీ ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్ రెడ్డితో తెలంగాణ మాజం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన గొప్ప నాయకుడు అని, ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశాడన్నారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఆయన మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, తనతో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను ఎన్నటికీ మరువలేమన్నారు. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, ఉద్యమ పట్ల అంకితభావంతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.