తిరుపతి, జూలై : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో జరుగనున్నది. ఈ యాగంలో భక్తులు తమ ఇళ్ల నుంచి టీవీల ద్వారా వర్చువల్ విధానంలో మహాయాగంలో పాల్గొనాలనుకుంటే ఇద్దరికి రూ.1001/- ఆన్లైన్లో టికెట్లను పొందవచ్చు.
వర్చువల్ విధానంలో మహాయాగంలో పాల్గొనే గృహస్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం భక్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అమ్మవారి అక్షింతలు అందజేయనున్నారు.