ధర్మశాల: విండీస్తో టీ20 సిరీస్ చేజిక్కించుకున్న అనంతరం పది రోజుల పాటు బయో బబుల్ నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. తిరిగి ప్రాక్టీస్ షురూ చేశాడు. లంకతో టీ20 సిరీస్కు విరామం తీసుకున్న మాజీ కెప్టెన్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. శుక్రవారం నుంచి లంకతో ప్రారంభం కానున్న తొలి టెస్టు.. విరాట్కు వందోది కాగా.. ప్రతిష్ఠాత్మక మ్యాచ్లో సత్తాచాటాలని కోహ్లీ తహతహలాడుతున్నాడు. కెరీర్ ఆరంభంలో వరుస శతకాలతో విజృంభించిన కోహ్లీ.. గత రెండేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో మూడంకెల స్కోరు నమోదు చేయని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి దూరమైన విరాట్.. స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్తోనైనా మునుపటి ఫామ్ అందుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.