Virat Kohli | వెస్టిండిస్తో మూడు మ్యాచ్ల సిరీస్ (WI vs Ind Odi Series)లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న టీమ్ఇండియా.. శనివారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్లు అభిమానులను అలరించకపోయిన మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) చేసిన పని అందరిని ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక చిన్నారి స్టేడియంలో నిలబడి కోహ్లీ.. కోహ్లీ.. అంటూ పిలవగా.. కోహ్లీ ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి చిన్నారిని, ఆమె కుటుంబాన్ని కలిశాడు. ఈ క్రమంలో ఆ చిన్నారి కోహ్లీకి బ్రేస్లెట్ గిప్ట్గా (Bracelet) ఇచ్చింది. ఆ బ్రేస్లెట్ ధరించిన కోహ్లీ చిన్నారికి థాంక్యూ చెప్పాడు. అనంతరం ఆ ఫ్యామిలీకి ఆటోగ్రాఫ్ ఇచ్చి వాళ్లతో సెల్ఫీ దిగాడు.
కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కూడా ఈ కుటుంబాన్ని కలిసి ఫోటోలు దిగారు. ఈ ఘటనపై చిన్నారి స్పందిస్తూ నేను కోహ్లీ కోహ్లీ.. అంటూ అరుస్తుంటే కోహ్లీ విని నా దగ్గరకు వచ్చాడు. అప్పుడే నేను స్వయంగా.. చేసిన బ్రేస్లెట్ను తనకు ఇచ్చానని’ చిన్నారి చెప్పింది. దీనిపై తండ్రి మాట్లడుతూ.. నా కూతురు పిలువగానే కోహ్లీ ఇక్కడకు వచ్చాడు. పాప ఇచ్చిన బ్రేస్లెట్ తీసుకుని నేను వేసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు సంతోషంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కోహ్లీ డౌన్ టు ఎర్త్ మనస్తత్వంతో ఉన్నాడని తెలిపాడు. బీసీసీఐ అప్లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Fan gestures like these 🤗
Autographs and selfies ft. #TeamIndia Captain @ImRo45, @imVkohli & @surya_14kumar ✍️
Cricket fans here in Barbados also gifted a bracelet made for Virat Kohli 👌👌#WIvIND pic.twitter.com/Qi551VYfs4
— BCCI (@BCCI) July 30, 2023