న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టూర్ కన్నా ముందు విరాట్ కోహ్లీ రిలాక్స్ అవుతున్నాడు. వెకేషన్ మూడ్లో ఉన్న అతను.. ఓ బీచ్లో కనిపించాడు. తన టూర్కు సంబంధించిన ఫోటోను అతను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు విరాట్ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే 2021లో కోవిడ్ వల్ల వాయిదాపడ్డ టెస్ట్ మ్యాచ్ను ఆడేందుకు ఇండియన్ జట్టు ఇంగ్లండ్ వెళ్లనున్నది. అయిదో టెస్టు జూలై ఒకటో తేదీన ప్రారంభంకానున్నది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరిసారి 2007లో ఇంగ్లండ్లో జరిగిన టెస్టు సిరీస్ను ఇండియా గెలిచింది.