యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్నారు.
శుక్రవారం ఉదయం వినోద్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి నిజాభిషేకం సేవలో పాల్గొని ప్రత్యేక పూజలుచేపట్టారు.
అంతకు ముందు అర్చకులు వినోద్ కుమార్కు ఘన స్వాగతం పలికారు. స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యాదాద్రి పునర్నిర్మాణ పనుల గురించి వినోద్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.