హుజూరాబాద్: ఆ నియోజకవర్గంలోని ఊర్లన్నీ ఏకమైతున్నయ్..టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కే తమ ఓటంటూ మద్దతు ప్రకటిస్తున్నయ్. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేన్ వెలువడడం.. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయడంతో ఆ పార్టీ ప్రచారం ఊపందుకుంది. అటు నియోజకవర్గంలోని పలు గ్రామల ప్రజలు సామాజిక వర్గాల వారీగా తమ మద్ధతును టీఆర్ఎస్ పార్టీకే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలు, కింది క్యాడర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా సింగపురంలో హుజూరాబాద్ మండల పరిధిలోని పోతిరెడ్డిపేటకు చెందిన లింగబలిజ కులస్తులు మంత్రి హరీశ్ రావును కలిశారు. ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ మద్ధతునిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. హూజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే.. అభివృద్ధి బాధ్యత తన భుజాలపై వేసుకుంటానని హామీ ఇచ్చారు. ఆరు సార్లు ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ హుజూరాబాద్కు చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తే..ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిచిన వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి..గూడు లేనివారికి పంపిణీ చేస్తామని చెప్పారు.