న్యాల్కల్ : టీఆర్ఎస్ పాలన లోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కాకిజనవాడ, హుస్సేన్ నగర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.10 లక్షల చొప్పున మంజూరైన నిధులతో చేపట్టిన సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకిజనవాడ గ్రామంలో ఎమ్మెల్యే మాణిక్యరావును బాజాభజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికి అశ్వo పై కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసు కెళ్లారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఇంతకుముందు మండలంలోని చాల్కీ గ్రామంలో ఇటీవల మాజీ ఎంపీటీసీ తండ్రి తో పాటు రాఘవపూర్ గ్రామంలో సుధాకర్ రెడ్డి తండ్రి మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, వైస్ ఎంపీపీ గౌసో ద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, ఎంపీటీసీలు శ్రీనివాసరెడ్డి, సిద్దన్న, సర్పంచులు శకుంతల, జ్ఞానేశ్వర్ పాటిల్, మండల పార్టీ నాయకులు భూమారెడ్డి వీరారెడ్డి, నర్సింలు, దశరత్, గంగాధర్, బోజారాజ్, కైరోద్ధీన్ పటేల్, సిద్దయ్య స్వామి గోవిందరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.