హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : జీపీలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేటి నుంచి 10వతేదీ వరకు సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల సమగ్ర శిక్షణలో భాగంగా మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖైరతాబాద్, జూలై 7 : గురుకుల విద్యాసంస్థల్లో గుడ్లు, కిరాణా సరఫరా టెండర్లకు సంబంధించిన జీవో 17ను వెంటనే రద్దు చేసి, డీపీసీ విధానంలోనే టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాట్లాడారు.