వికారాబాద్, అక్టోబర్ 7: గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నిఖిల సం బంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై పోలీస్, విద్యావిద్యుత్, రవాణా శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 పరీక్షా కేం ద్రాల్లో ఈనెల 16వ తేదీన జరుగనున్న ఈ పరీక్షకు 4,857 మంది అభ్యర్థులు హాజరు కాను న్నట్లు తెలిపారు.
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రా ల్లో తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్ వంటి వసతులను కల్పించడంతోపాటు పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండే లా చూడాలని అధికారులకు సూ చించారు. కేంద్రాల్లో సీసీ కెమెరాల ను అమర్చి, హాజరును బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని.. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అశోక్కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ షర్మిల, సూపరింటెండెంట్ రవీందర్ దత్తు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్నాయక్, వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ మహేశ్, ప్రభు, ఎం ఈవో బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు.