తాండూరు రూరల్, అక్టోబర్ 26 : ఉప సర్పంచ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం నెగ్గింది. తాండూరు మండలం, మిట్ట బాసు పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆర్డీవో అశోక్కుమార్, ఎంపీవో రతన్సింగ్ సమక్షంలో గ్రామ సర్పం చ్ నరేందర్రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. గతంలో ఉపసర్పంచ్ గోవింద్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు మంగళ వారం ఆర్డీవోతోపాటు ఎంపీఈవో రతన్సింగ్ సమక్షంలో ఉప సర్పం చ్ గోవింద్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు శ్రీధర్, శివ రాజ ప్ప, పద్మమ్మ, లక్ష్మి, టి.బస్వరాజ్, టి.రమేష్, యాదమ్మ హాజర య్యారు. ఉపసర్పంచ్ గోవింద్ గైర్హాజరయ్యారు.ఎనిమిది మంది వార్డు సభ్యులకు గాను ఏడు గురు వార్డు సభ్యులు, సర్పంచ్ సమా వేశానికి హాజరయ్యారు. ఉప సర్పంచ్ గోవింద్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. అం దులో ఉపసర్పంచ్ పదవి నుంచి గోవింద్ను తొలగించాలని ఏడు గురు వార్డు సభ్యులు తీర్మానం చేస్తూ చేతులు పైకి ఎత్తారు. మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు ఉపసర్పంచ్గా కొనసాగిన గోవింద్ను పదవి నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ సభ తీర్మానం అంశాలను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. నూతన ఉపసర్పంచ్ ఎన్నిక కోసం మరో తేదీ ఉన్న తాధి కారులు ఖరారు చేస్తారని ఆయన వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కరణ్కోట ఎస్సై ఏడుకొండలు బందో బస్తు ఏర్పాటు చేశారు.