తాండూరు, నవంబర్ 11 : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో గురువారం ఏఐఎంఎస్ అధికారులు వికాస్ బాటియా, శ్యాంసుందర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రవిశంకర్తో కలిసి ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవల కోసం రాష్ట్రంలోని జిల్లా దవాఖానల్లో రూ.కోట్ల నిధులతో ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణవాయువు అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా తాండూరు జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.