మోమిన్పేట/మర్పల్లి, నవంబర్ 10 : మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బుధ వారం పంచాయతీ కార్యదర్శులు,టెక్నికల్ అసిస్టెంట్, వనసేవక్లకు ఎఫ్వో లావణ్య నర్సరీ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ చేసి విత్తనాలు విత్తే నుంచి మొక్కలు పెరిగే వరకు ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించారు. నాటిన ప్రతి విత్తనం మొక్కగా పెరిగేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ లక్ష్మి, కుమారి, ఎంపీడీవో శైలజారెడ్డి, వెంకట్రామ్ గౌడ్, ఏంపీవో లు, ఏపీవోలు, టీఏలు, ఈసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
దోమ, నవంబర్10: నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీడీ సరళా కుమారి అన్నారు. దోమ మండల పరిధిలో ఉన్న తిమ్మాయిపల్లి ఫారెస్టు నర్సరీలో బుధవారం బొంరాస్పేట్ మండలానికి చెందిన వివిధ గ్రామాల పంచాయతీ కార్య దర్శులు, వనసేవకులకు ఏపీడీ సరళకుమారి సమక్షంలో ప్లాంటేషన్ సూపర్వైజర్ రాజయ్య నర్సరీల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ హరి బాబు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వనసేవకులు పాల్గొన్నారు.
యాలాల నవంబర్ 10 : యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్లో నర్సరీల నిర్వహణపై బుధవారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి స్వప్న పంచాయతీ కార్యదర్శులు, వన సేవకులు, టీఏలకు రెండోరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే విధానంతో పాటు సంరక్షణ చర్యల గురించి వివరించారు. మొక్కల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయన్నారు.