భారత జట్టులో చోటు కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆంధ్ర కెప్టెన్ కేఎస్ భరత్ (109 బంతుల్లో 161 నాటౌట్; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. ఆదివారం గ్రూప్-‘ఎ’లో భాగంగా హిమాచల్తో జరిగిన పోరులో భరత్, అశ్విన్ హెబ్బర్ (100; 10 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఆంధ్ర 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. భరత్, అశ్విన్ దంచికొట్టగా.. ఆఖర్లో అంబటి రాయుడు (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో హిమాచల్ప్రదేశ్ 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అయ్యర్ అదుర్స్
పేస్ ఆల్రౌండర్గా టీమ్ఇండియాలో సుస్థిర స్థానం దక్కించుకోవాలనుకుంటున్న యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ విజయ్ హజారే టోర్నీలో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 348 పరుగులతో పాటు 8 వికెట్లు పడగొట్టిన వెంకటేశ్.. ఆదివారం చండీగఢ్తో జరిగిన పోరులో 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. వెంకటేశ్తో పాటు అదిత్య శ్రీవాత్సవ (70) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 పరుగులు చేసింది. ఛేదనలో కడదాకా పోరాడిన ఛత్తీస్గఢ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 326 రన్స్ చేసి 5 పరుగుల తేడాతో ఓటమి వైపు నిలిచింది. ఛత్తీస్గఢ్ తరఫున మనన్ వోహ్రా (105), కౌషిక్ (111) శతకాలు నమోదు చేశారు.