మహబూబ్నగర్, మార్చి 4 : అందరి సంక్షేమానికి ప్రతిక్షణం ఆరాటపడే మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్య కుట్ర చేయడం దుర్మార్గపు చర్య అని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. బీజేపీ నాయకులు స్వప్రయోజనాలకో సం ఇంతటి ఘాతుకానికి పాల్పడేందుకు యత్నిస్తారని ఊహించలేదని తెలిపారు. హత్య కుట్రలో భా గస్వాములైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కుట్రదారులకు మాజీ ఎంపీ జితేందర్రెడ్డి షెల్టర్ ఇవ్వడం సరికాదన్నారు. సమావేశంలో రవీందర్రెడ్డి, నర్సింహారెడ్డి, అనంతరెడ్డి, దేవేందర్రెడ్డి, వెంకటేశ్వరమ్మ, పాండురంగారెడ్డి, తిరుపతిరెడ్డి, రా జేశ్వర్రెడ్డి, ప్రతాప్రెడ్డి ఉన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్రలు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. పాలమూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తు న్న మంత్రి శ్రీనివాస్గౌడ్పై కుట్రలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో యాదయ్య, ఆంజనేయులు, శ్రీకాంత్గౌడ్, సుదర్శన్రెడ్డి, బాలాగౌడ్, జయన్నగౌడ్, వెంకటన్నగౌడ్, నర్సింహులు, రాం చంద్రారెడ్డి, శంకర్ తదితరులు ఉన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్రలు చేయడం హేయనీయమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో అఖిలభారత యాదవ సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడేండ్లలోనే మహబూబ్నగర్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అభివృధ్ధిని చూసి ఓర్వలేక కుట్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సాయిల్యాదవ్, శాంతయ్యయాదవ్, నర్సింహులుయాదవ్, పాపారాయుడు, శ్రీనివాస్యాదవ్, రాజుయాదవ్, చందూయాదవ్, సుజిత్, అనిల్, గణేశ్ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కుట్రలను సాగనివ్వమని ముదిరాజ్ సం ఘం నాయకులు అన్నారు. బెదిరింపు రాజకీయాలకు ఇక్కడ చోటులేదని, మరోసారి ఇలాంటి కుట్ర లు చేస్తే తగ్గిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు సత్యనారాయణ, పెద్ద విజయ్కుమార్, కృష్ణమోహ న్, తాటి గణేశ్, కిశోర్కుమార్, గంజి వెంకన్న, పటే ల్ ప్రవీణ్, గంజి వెంకట్రాములు, నరేందర్, తిరుపతయ్య, సత్యపాల్, హరికృష్ణ ఉన్నారు.
అందరి సంక్షేమానికి పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ను హతమార్చేందుకు కుట్రలు చేయడం బాధాకరమని జాండ్ర సంఘం నాయకు లు అన్నారు. ఆ సంఘం కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. 70ఏండ్లలో జరగని అభివృద్ధిని ఏడేండ్లలో చేసి చూపిన ఘనత మంత్రి శ్రీనివాస్గౌడ్కే దక్కిందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్ వేదవ్రత్, మహేందర్, రామలింగం, మల్లేశ్, శాంతయ్య, రాములు ఉన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్పై కుట్ర చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయిల్గౌడ్, బాలకిషన్ అన్నారు. స్థానిక టీఎన్జీవోఎస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి కుట్రలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాంచంద్రయ్య, సు ధాకర్ తదితరులు ఉన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్పై కుట్రలు చేస్తే సహించేదిలేదని దళిత సంఘాల నాయకులు హెచ్చరించా రు. స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దౌర్జన్యాల రాజకీయాలకు ఇక్కడ తావులేదన్నారు. కుట్రలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాండం ఆంజనేయులు, వినోద్కుమార్, జంబుల య్య, హన్మంతు, నర్సింహులు, శ్రీనివాసు లు, శరత్చంద్ర, పత్తి వెం కట్రాములు, డబ్బా రాములు, రమేశ్, కాలే రమేశ్, ప్రదీప్కుమా ర్, యాదయ్య, రాజు ఉన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 4 : మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ డి మాండ్ చేశారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన స మావేశంలో పీపీ బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్గౌడ్ను హతమార్చాలని కుట్ర చే యడం హేయనీయమన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంతు, పీపీలు మనోహర్, మురళీకృష్ణ, పరందాములుగౌడ్, పుట్టపాగ రఘుపతి, స్వదేశ్, విక్రమ్దేవ్, చంద్రశేఖర్, వెంకట్రాములు, రాజాగౌడ్, గోపాల్ ఉన్నారు.
మహ్మదాబాద్, మార్చి 4 : జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ను హతమార్చేందుకు కుట్ర చేయడం దుర్మార్గపు చర్య అని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి ప్రకటనలో పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహబూబ్నగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీనివాస్గౌడ్కు హాని చేయాలని చూస్తే ప్రజలే తగి న బుద్ధి చెబుతారని హెచ్చరించారు.