హుజురాబాద్ టౌన్ : లెప్టిస్ట్ భావాలు కలిగిన ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరి స్వయం సేవకులుగా పనిచేస్తున్న విశ్వహిందూ పరిషత్ నాయకులను, కార్యకర్తలను, సభ్యులను పార్టీలో చేరినప్పటినుండి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తట్టుకోలేక హుజూరాబాద్కు చెందిన విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర నటరాజ్, వీహెచ్పీ హుజురాబాద్ మండల ఉపాధ్యక్షుడు నల్లగొండ రాకేష్తో పాటు సుమారు 100 మంది వీహెచ్పీ నాయకులు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరందరికీ మంత్రి హరీష్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల రాజేందర్ ఎప్పుడు తనగురించి తప్పా పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకుండా, బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తన సొంత ఇమేజ్ను పెంచుకునేందుకు చేస్తున్న వ్యక్తిగత ప్రచారాన్ని తట్టుకోలేకపోయామని,లెఫ్ట్ భావాలు కలిగిన ఈటలను బీజేపీలోకి తీసుకొన్నాకా కూడా రైట్ భావాలను అనుసరించకుండా, వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పాటుపడటాన్ని తట్టుకోలేక టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు బుర్ర నటరాజ్, నల్లగొండ రాకేష్ తదితరులు తెలిపారు.
చేరిన వారిలో నటరాజ్, రాకేష్లతో పాటు వీహెచ్పి కార్యకర్తలు మోహన్, గణేష్, రాజు, శ్రీనివాస్, రవి, రమేష్, చిరంజీవి తదితర వందమంది కార్యకర్తలు ఉండటంతో దాదాపుగా జూరాబాద్లో వీహెచ్పీ ఖాళీ అయినట్లుగా పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి తదితరులు ఉన్నారు.