కరీంనగర్ : ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో జూమ్ వీడీయో ద్వారా కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీకా పంపిణీ పై సమీక్షించారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో టీకా పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.