న్యూఢిల్లీ, నవంబర్ 14: మధుమేహంతో బాధపడే వారందరికీ వెంటనే కొవిడ్-19 వ్యాక్సిన్ను వేయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆదివారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అవసరమున్నవారికి మూడో డోసు (బూస్టర్ డోసు) కూడా వేయాలన్నది. ఆదివారం ప్రపంచ మధుమేహుల దినం. ఈ సందర్భంగా నిర్వహించిన మారథాన్లో ఐఎంఏ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.