వాషింగ్టన్: పాకిస్థాన్కు ఎఫ్16 యుద్ధ విమాన పరికరాలను అమ్మేందుకు బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది. సుమారు 450 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఎఫ్-16 విమాన పరికరాలను అమ్మేందుకు అమెరికా సిద్ధమైంది. భవిష్యత్తులో పాక్ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. బుధవారం రిలీజ్చేసిన నోటిఫికేషన్లో అమెరికా కాంగ్రెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎఫ్-16లతో పాటు సంబంధిత ఎక్విప్మెంట్ను సుమారు 450 మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ఆమోదం తెలిపినట్లు యూఎస్ కాంగ్రెస్ పేర్కొన్నది. ఈ అమ్మకానికి సంబంధించి డిఫెన్స్ సెక్యూర్టీ కొఆపరేషన్ ఏజెన్సీ ద్రువీకరణ ప్రకటన చేసింది.
పాకిస్థాన్లో పనిచేసిన మాజీ భారత హై కమిషనర్ పార్థిసారథి మాట్లాడుతూ.. ఎఫ్-16 యుద్ధ విమానాల అమ్మకంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానాల్లో అడ్వాన్స్డ్ రేడార్, మిస్సైల్ సామర్థ్యం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫైటింగ్ అంశంలో పాకిస్థాన్కు ఒకరకంగా ఆధిపత్యం ఉన్నట్లే అవుతుందని ఆయన అన్నారు. పాక్కు ఎఫ్-16 విమానాలను అమ్మడం ఆందోళనకరంగా భావించాలని ఆయన తెలిపారు. అమెరికాకు ఆ సంకేతాన్ని పంపించాలని కూడా పార్థిసారథి తెలిపారు. ఈ అంశాన్ని ఏరకంగానూ విస్మరించరాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.